'సై రా'లో పూనమ్.. మరి పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

By Udayavani DhuliFirst Published Aug 16, 2018, 3:29 PM IST
Highlights

నిమాలో మరో పాత్ర కోసం పూనమ్ కౌర్ ని ఆడిషన్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి. తమన్నా వంటి స్టార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలో మరో పాత్ర కోసం పూనమ్ కౌర్ ని ఆడిషన్ చేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమె 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో కూడా హీరోయిన్ అక్క పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'సై రా' సినిమాలో ఆమెను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయు.

కొద్దిరోజులుగా పూనమ్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో చిరంజీవి 'సైరా' సినిమాలో ఆమెకు నటించే ఛాన్స్ ఇస్తే.. మెగాఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేకర్స్ ఈ విషయంలో మరొక ఆలోచన చేస్తారేమోననే మాటలు వినిపిస్తున్నాయి. పూనమ్ ని గనుక తప్పిస్తే ఆ పాత్రలో 'ఆనందం' ఫేమ్ రేఖని తీసుకునే ఛాన్స్ ఉంది. 

click me!