పూజాహెగ్డే కు ఇటిలీలో ఇబ్బంది..మరి ప్రభాస్ పరిస్థితి ఏంటో

By Surya PrakashFirst Published Oct 18, 2020, 3:58 PM IST
Highlights

 అంతా బాగానే చెప్పింది..కానీ ప్రభాస్ షూటింగ్ లో ఎలా ఉన్నారు..ఆయన ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా అనేది ఫ్యాన్స్ కు కావాలి..ఆ వివరాలు చెప్తే బాగుండేది. ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ విశేషాలు ఆమె తెలియచేసారు. అలాగే తను డ్యూయిల్ రోల్ లో చేస్తున్నానంటూ వస్తున్న వార్తలపై  తాజాగా పూజాహెగ్డే స్పందించారు. 

 ప్రభాస్‌-పూజాహెగ్డే కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్‌-పూజాహెగ్డేపై పలు కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ విశేషాలు ఆమె తెలియచేసారు. అలాగే తను డ్యూయిల్ రోల్ లో చేస్తున్నానంటూ వస్తున్న వార్తలపై  తాజాగా పూజాహెగ్డే స్పందించారు. కరోనా వైరస్‌ కారణంగా  అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌లో పాల్గొంటున్నామని వివరించారు.

 పూజ మాట్లాడుతూ...‘ఇటలీలో చిన్న సెట్‌ వేసుకుని.. అతి తక్కువ మంది టీమ్ తో జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌ చేస్తున్నాం. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాం. సెట్‌లో ఉన్నంతసేపు మాస్క్‌ ధరిస్తున్నాం. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్క్‌ తీస్తున్నాం. ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. షూట్‌ ప్రారంభించిన మొదటి రెండు రోజులు భయం, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అంతాబాగానే చెప్పింది..కానీ ప్రభాస్ షూటింగ్ లో ఎలా ఉన్నారు..ఆయన ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా అనేది ఫ్యాన్స్ కు కావాలి..ఆ వివరాలు చెప్తే బాగుండేది.

అలాగే ‘రాధేశ్యామ్‌’లో తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని పూజా వెల్లడించారు. ‘‘పురాణాల్లో చూపించిన ‘రాధ’ పాత్రను పోషిస్తున్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాది ఆ పాత్ర కాదు. కాకపోతే.. చారిత్రాత్మకమైన ప్రేమికులే మాకు స్ఫూర్తి. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేయడం లేదు. మునుప్పెన్నడూ లేనివిధంగా నాలో టాలెంట్‌ బయటపెట్టేందుకు మంచి అవకాశం దొరికింది. ఇటీవల నా పుట్టినరోజున (అక్టోబర్‌ 13) ఓ ఎమోషనల్ సీన్ ని షూట్ చేసారు’ అని పూజాహెగ్డే
వివరించారు. 

click me!