‘ఖుషి’ రీ రిలీజ్‌..రికార్డ్.. ఇండియాలోనే తొలి సారి

By Surya PrakashFirst Published Dec 29, 2022, 5:46 PM IST
Highlights

ఖుషీ  ఈ నెల 31న సరికొత్త 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం రీరిలీజ్ టైమ్ లోనూ కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం విశేషం

ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను లేటెస్ట్  టెక్నాలజీని జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేష్, ప్రభాస్ వంటి స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో  మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమా రీరిలిజ్‌కు సిద్ధమైంది. 

 ఈ నెల 31న సరికొత్త 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్నారు. అభిమానులు యూట్యూబ్ లో చాలా సార్లు చూసినా మరోసారి  బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆన్ లైన్ లో  టికెట్లు పెట్టడం ఆలస్యం వేగంగా బుకింగ్ అవ్వుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీస్ లో ఓ  కొత్త స్ట్రెయిట్ మూవీ రిలీజ్ అవుతోందన్న రేంజ్ లో హంగామా జరగుతోంది.  

ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేస్తున్నారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా రీరిలీజ్ కు బెనిఫిట్ షోలు ప్లాన్ చేయటం తొలిసారి అంటున్నారు. ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు.

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించారు.  ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

click me!