పవన్-త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం

First Published Apr 3, 2017, 1:57 PM IST
Highlights
  • పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రారంభం
  • అను ఎమాన్యుయెల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల పై సీన్స్ చిత్రీకరిస్తున్న త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించే.. పవన్ కెరీర్లోనే అతి పెద్ద హిట్టు ఇచ్చిన అతడి మిత్రుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ఉదయం ఆరంభమైంది. 

హారిక-హాసిని క్రియేషన్స్ బేనర్లో త్రివిక్రమ్ మిత్రుడు ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘కాటమరాయుడు’ షూటింగ్ అయ్యాక మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా పవన్ ఈ సినిమా పని మొదలుపెట్టేస్తున్నాడు.

త్రివిక్రమ్-పవన్ సినిమాలో లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కాగా.. ఆమె వెంటనే షూటింగ్‌కు రావట్లేదు. ముందుగా రెండో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో నటించనున్నాడు పవన్. అను రెండో హీరోయినే అయినా.. ఆమెకు కూడా కథలో కీలక పాత్ర ఉంటుందట. ఈ సినిమా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని.. ఇందులో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. 

‘సరైనోడు’లో విలన్‌గా మెప్పించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించనున్నాడు. నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి.. ఆగస్టులోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ప్రణాళికలో ఉన్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. రూ.100 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.

click me!