మెగా ఫ్యాన్స్ కు అదరిపోయే అప్ డేట్ ఇచ్చారు మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్. ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి పోస్టర్ ను టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో.. ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. దాదాపు నాలుగైదు సినిమాలు సెట్స్ ఎక్కించి.. వారికి కొంత.. వారికి కొంత టైమ్ కేటాయిస్తూ.. తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్లో దర్శనమిస్తూ చక చక షూటింగ్లను కంప్లీట్ చేస్తున్నాడు. ఈక్రమంలో పవన్ చేతిలో ఉన్న నాలుగైదు సినిమాలలో... తమిళ రీమేక్ మూవీ వినోదయ సిత్తం రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ లో పవన్ వర్షన్ ను 20 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమాకు బ్రో టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్..
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేయగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి భారీ స్తాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరోసారి ఈసినిమా నుంచి టైటిల్ రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్లో సంబరాలు చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది.
Here's the 1st Peek at Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 💥 & 🤩 … pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy)ఇక తాజాగా ఈసినిమా నుంచి మరోసారి పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. మామా అల్లుళ్లు కలిసి ఉన్న పోస్టర్ను రిలీజ్ చేసింది. బైక్పై కాలుపెట్టిన పవన్, పవన్ వెనుకాల సాయిధరమ్ ఉన్న పోస్టర్ అదిరిపోయింది. క్లాస్సీ లుక్లో మామా అల్లుళ్ల దర్శనం ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంది. నిన్న, మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని సినిమాపై గత వారం, పది రోజులుగా వరుస పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించగా.. సాయి తేజ్ మార్క్ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.
తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సముద్రఖనీ రీమేక్ వెర్షన్ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నటుడిగా, దర్శకుడిగా సముద్రఖని అందరికి సుపరిచితమే. ఇక త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బ్రో' సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి కానుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.