
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది `ఓజీ`తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలి తీర్చాడు. ముంబయి గ్యాంగ్ స్టర్గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్ చేసిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్లు వసూలు చేసింది. ఇక త్వరలో `ఉస్తాద్ భగత్ సింగ్`తో రాబోతున్నారు పవన్. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమా ప్రకటన వచ్చింది. పవన్ నెక్ట్స్ చేయబోతున్న సినిమా ఏంటో తెలిసిపోయింది. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుంటూ డ్రీమ్ నిజం కాబోతుందని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.
ఈ సందర్భంగా రామ్ తల్లూరి ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెడుతూ, `జోడించిన చేతులతో, నిండు హృదయంతో, నా కల `జైత్ర రామ మూవీస్` బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1గా ఇది ప్రారంభం కాబోతుంది. మన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ, ఆశీస్సులతో నామకరణం చేయబడింది. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పటికీ గర్వపడతాను. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్` అని తెలిపారు నిర్మాత రామ్ తాళ్లూరి. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. పవన్ నెక్ట్స్ మూవీ ఇదే ఉండబోతుందని తెలుస్తోంది.