`ఓరి దేవుడా` ట్రైలర్‌.. బ్రేకప్‌ ఇష్టమంటోన్న పూరీ జగన్నాథ్‌.. విశ్వక్ సేన్‌కి సెకండ్‌ ఛాన్స్ ఇచ్చిన వెంకటేష్

By Aithagoni RajuFirst Published Oct 7, 2022, 5:42 PM IST
Highlights

`ఓరి దేవుడా` ట్రైలర్‌ విడుదలైంది. విక్టరీ వెంకటేష్‌ ఈ సినిమా టర్ఐలర్‌ని విడుదల చేశారు. ఇందులో వెంకటేష్‌, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. 

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఓరి దేవుడా`. `అశోకవనంలో అర్జున కళ్యాణం` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `ఓరి దేవుడా`తో వస్తున్నారు. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈసినిమా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. విక్టరీ వెంకటేష్‌ ఈ సినిమా టర్ఐలర్‌ని విడుదల చేశారు. ఇందులో వెంకటేష్‌, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. 

విశ్వక్‌ సేన్‌ ఇందులో `అర్జున్‌ దుర్గరాజుగా నటించాడు. ఆయన, హీరోయిన్‌తో కోర్టులో విడాకులు కేసు వాదనలతో ట్రైలర్‌ మొదలైంది. జడ్జ్‌ వీరి కేసు నెంబర్‌ చెబుతూ విడాకుల విషయాన్ని ప్రస్తావించగా, బ్రేకప్ ఐ లవ్‌ బ్రేకప్‌ అంటూ పూరీ జగన్నాథ్‌ చెప్పడం విశేషం. ఆ తర్వాత తనగోడుని వెంకీకి వివరిస్తుంటాడు హీరో విశ్వక్‌ సేన్‌. చూడబోతుంటే ఇందులో వెంకీ గాడ్‌ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

ఇందులో తాను పెళ్లి చేసుకున్న అమ్మాయితో విడాకులు విషయం వెంకీకి చెబుతూ, లవ్‌ మ్యారేజా? అరెంజ్‌ మ్యారేజా అని అడగ్గా, లవ్వే లేని లవ్ మ్యారేజ్‌ అని చెప్పగా, అదేం పెళ్లి అంటూ వెంకీ, పక్కనే ఉన్న రాహుల్ రామకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇక మామ పాత్రలో చేసిన మురళీ శర్మ.. విశ్వక్‌ సేన్‌ కింద పెన్ను పెట్టడం, తన భార్య పక్కనే ఉండగా మీరా అనే మరో అమ్మాయి మెసేజ్‌ చేయడంతో వీరిద్దరి మధ్య కలహాలు ప్రారంభమవుతాయి. మీరా తన క్లాస్‌ సీనియర్‌. మరి ఆమెకి, అర్జున్‌కి సంబంధం ఏంటనేది ఈసినిమాగా తెలుస్తుంది. 

ఇందులో అర్జున్‌కి వెంకీ `అలా చెబితే అయిపోతావ`ని చెప్పడంతోపాటు నీ లైఫ్‌ని మార్చుకునేందుకు నేను ఇచ్చే సెకండ్‌ ఛాన్స్ ఈ టికెట్‌ అని ఓ టికెట్‌ని వెంకీ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ట్రైలర్‌ చివరల్లో వైఫ్‌లో ఫ్రెండ్‌ని చూడొచ్చు సర్‌, కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందా? అంటూ విశ్వక్‌ సేన్‌ వెంకీకి దెండం పెట్టడం ఆసక్తిగా ఉంది. మొత్తానికి మ్యారేజ్‌లోని కలహాలు, మనస్పార్థాలు ఈ క్రమంలో పుట్టే ఫన్‌ నేపథ్యంలో `ఓరి దేవుడా` సినిమా సాగుతుందని తెలుస్తుంది. ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఈట్రైలర్‌ని విడుదల చేసిన వెంకీ చిత్ర బృందానికి విషెస్‌ చెప్పారు. 

విశ్వక్‌ సేన్‌ హీరోగా, మిథిలి పల్కర్‌, ఆషా భట్ హీరోయిన్లుగా నటించగా, వెంకటేష్‌ కీ రోల్‌ చేశారు. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వం వహించారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై పిరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 21న విడుదల చేయబోతున్నారు. 

click me!