అవమానించే విధంగా కమెడియన్ టిక్ టాక్ వీడియో..నెటిజన్స్ ఆగ్రహం

Published : Aug 30, 2019, 03:59 PM IST
అవమానించే విధంగా కమెడియన్ టిక్ టాక్ వీడియో..నెటిజన్స్ ఆగ్రహం

సారాంశం

రీసెంట్ కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రణు మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు.

రీసెంట్ కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రణు మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు. జడ్జ్ గా ఉన్న హిమేష్ రేషమ్మియా ఆమె గాత్రానికి ఫిదా అయిపోయాడు. 

ఆమెతో తేరి మేరీ అనే పాటను పాడించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో అందరిని ఆకర్షించింది. అదే వీడియోను ఓడిశా కమెడియన్‌, పప్పు పామ్‌ పామ్‌గా ఫేమస్‌ అయిన తత్వా ప్రకాశ్‌ సతపతి ఇమిటేట్ చేశారు. టిక్ టాక్ లో ఆ వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ తిట్టిన తిట్లు తింట్టకుండా తిడుతున్నారు. 

కొంతమంది బుర్రలేక స్పూఫ్ చేస్తుంటే నువ్వు ఒక కళాకారుడివి అయ్యి ఉండి ఇలా రణు మండల్ ని అవమానించడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే అతనికి పిచ్చి పట్టిందని వెంటనే  సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి అని మరికొంత మంది కామెంట్ చేసున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
Sivaji Ganesan: స్టార్‌ కమెడియన్‌ని ఇంటికి పిలిచి అవమానించిన శివాజీ గణేషన్‌.. స్టార్‌ హీరోకి మతిపోయే కౌంటర్‌