‘జై లవ కుశ’ ఫస్ట్ కాపీ రెడీ

First Published Sep 13, 2017, 1:55 PM IST
Highlights
  • జై లవ కుశ సెన్సార్ పూర్తి
  • సినిమాకి యూ/ఏ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
  • ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కళ్యాణ్ రామ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదాథామస్ లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్లు.. సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

 

U/A for #JaiLavaKusa pic.twitter.com/KprpTJ0HwH

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 13 September 2017

ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందట. 155 నిమిషాల నిడివి గల ‘జై లవ కుశ’ సినిమా ను సెన్సార్ బోర్డ్ కు కూడా పంపించేశారట.. వారు దానిని వీక్షించి మూవీకి యూ/ఏ  సర్టిఫికేట్ జారీ చేశారు.  ఇక సినిమాలో మూడు పాత్రల్లోనూ తన నట విశ్వరూపం చూపించేశారు. పాటలు కూడా అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

 

అయితే.. సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా ఆ పాటలో నర్తించగా.. దానిని చిత్ర బృందం సస్పెన్స్ గా ఉంచింది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామన్న చిత్ర బృందం.. సినిమా ఫలితం గురించి కాకుండా. ఎంత మేరకు జనాల్లోకి తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నారట. అందుకే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా ఈ సినిమా అన్నదమ్ములందరీ అంకితమిస్తున్నాన్నాడు తారక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఈ నెల 21 వరకు ఆగాల్సిందే.

click me!