తలవంచి నా మన్నింపుని కోరుతున్నా.. అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు..

Published : Sep 02, 2022, 10:44 PM IST
తలవంచి నా మన్నింపుని కోరుతున్నా.. అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు..

సారాంశం

`బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

ఎన్టీఆర్‌(NTR) తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. `బ్రహ్మాస్త్ర` (Brahmastra) ఈవెంట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయిన నేపథ్యంలో క్యాన్సిల్ కి గల కారణాలు తెలియజేస్తూ సారీ చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని భావించగా, చివరి నిమిషంలో పోలీసులు ఈ ఈవెంట్‌కి అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్‌లో ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

`ముందుగా నేను నా అభిమానులకు క్షమాపణలు తెలియజేయాలి. ఎంతో ఆర్భాటంగా `బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌ని చేయాలనుకున్నారు. కానీ వినాయక చవితి ఉండటం వల్ల పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఎక్కువగా ఇవ్వలేమని, ఈవెంట్‌ని కంట్రోల్‌ చేయడం కష్టమనే ఉద్దేశంతో పోలీసులు పర్మిషన్‌ ఇవ్వలేదు. వాళ్లు ఉండేది, చేసేది మన భద్రత కోసం కాబట్టి వాళ్లు చెప్పే మాట వినడం ఈ దేశ పౌరుడిగా మన ధర్మం. అందుకు మేం కూడా వాళ్లకి సహకరించి ఈ రోజు ఇలా ఏర్పాటు చేయించాం` అని తెలిపారు ఎన్టీఆర్‌. 

ఆయన ఇంకా చెబుతూ, ఈ ఈవెంట్‌ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులకు అందరికి తలవంచి నా మన్నింపుని కోరుకుంటున్నా. ఈవెంట్‌కి రాకపోయినా మీరు మంచి సినిమాని ఆశీర్వదిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాకి కూడా క్షమాపణలు తెలియజేశారు తారక్‌.  రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన `బ్రహ్మాస్త్ర`లో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?