నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది.
నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది.
దీంతో బయ్యర్లు 'మహానాయకుడు' సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. అందులో బాలకృష్ణ ఖాకీ బట్టలు ధరించి, ఎన్నికల ప్రచారంలో ప్రజలను కలిసి మాట్లాడుతున్నారు.
తనకు స్వాగతం పలికిన నిరుపేద మహిళను ఆనందంలో హత్తుకున్నట్లుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇందులో హరికృష్ణ పాత్రదారి కళ్యాణ్ రామ్ కూడా కనిపిస్తున్నారు. ఓ పక్క రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 6 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సాధించి దూసుకుపోతుంది.
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ ట్రైలర్. ఇలాంటి నేపధ్యంలో ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ విడుదలవుతోంది. ఏమాత్రం ఇది వ్యూస్ లో వెనకబడినా.. ఇక వర్మ అతి తట్టుకోవడం కష్టమవుతుంది. మరి ఈ పరీక్ష నుండి మహానాయకుడు ఎలా గట్టెక్కుతాడో చూడాలి!
film trailer to be unveiled today [Sat]... Directed by Krish... pic.twitter.com/MI7aLMvSt1
— taran adarsh (@taran_adarsh)