నాగ్‌, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌..

By Aithagoni RajuFirst Published Feb 5, 2021, 7:41 PM IST
Highlights

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. 

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. చాలా రోజులుగా మలయాళ సినిమాలకే పరిమితమైన ఈ అమ్మడు తాజాగా విశాల్‌ చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యింది. 

తమిళంలో బిగ్‌ ఆఫర్‌ కొట్టేసింది. `ఎనిమీ` చిత్రంలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. ఇది తెలుగులోనూ విడుదల కానున్న విషయం తెలిసిందే. విశాల్‌, ఆర్య హీరోలుగా రూపొందుతున్న చిత్రమిది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్య సరసన మమతా మోహన్‌ దాస్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే విశాల్‌ సరసన మృణాలిని రవి నటించనుంది. ఈ సందర్భంగా గురువారం చిత్రంలోని ఆర్య పోస్టర్‌ని విడుదల చేశారు యూనిట్‌. ఇంటెన్స్ లుక్‌లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇక మమతా మోహన్‌ దాస్‌ చాలా రోజులు తర్వాత తమిళ సినిమాలో నటిస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తుంది మమతా మోహన్‌దాస్‌. దీంతోపాటు ప్రభుదేవా సినిమాలో చేస్తుంది. ప్రస్తుతం మలయాళంలో ఏడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

click me!