`ప్రేమమ్` ఫేమ్ మలయాళ నటుడు నివిన్ పాలీ నటించిన సినిమా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా సత్తా చాటింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `మూతన్` చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుంది.
మలయాళ హీరో నివిన్ పాలీ `ప్రేమమ్` సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. తాజాగా నివిన్ పాలీ నటించిన సినిమా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా సత్తా చాటింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `మూతన్` చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుంది.
అక్బర్ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ అందించిన నివిన్ పాలీకి ఉత్తమ నటుడిగా అవార్డు రాగా, బెస్ట్ చైల్డ్ అర్టిస్టుగా సంజనా దీపు, బెస్ట్ మూవీగా `మూతన్` పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. నివిన్ ఈ అవార్డు అందుకున్న మొదటి మలయాళ నటుడు కావడం విశేషం. గతేడాది నవంబర్ లో హిందీ, మళయాలం భాషల్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ విమర్శకుల నుండి అలాగే ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంది. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హిందీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించాడు. నివిన్ పాలీతోపాటు శోభిత ధూలిపాళ్ల, శశాంక్ అరోరా, రోషన్ మథ్యూ, సంజనా దీపూ తదితరులు నటించారు.
నివిన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో క్రేజీ హీరోల్లో ఒకరు. `ప్రేమమ్` మూవీతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓటీటీలో ఆయన సినిమాలకు భాషలకు అతీతంగా అనేక మంది ఫ్యాన్స్ అవడం విశేషం.