తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ వున్న హిరోయిన్ నిత్యా మీనన్. తనకు నచ్చితేగానీ సినిమాకు ఓకే చెప్పదు. సరైన కథలు రాకపోవడం వలనే తెలుగులో ఎక్కువగా నటించడం లేదని గతంలో చెప్పుకొచ్చింది. తాజాగా నాని నిర్మిస్తోన్న ‘అ!’ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదలైంది.
దీంతోపాటు శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా నిత్యామీనన్ ఓకే చేసింది. సినిమా ఓపెనింగ్ రోజు చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నిత్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. సినిమాలో తనతో పాటు ఉన్న మరో హీరోయిన్ కాజల్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో నిత్య ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామానాయుడు స్టూడియోస్లో సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే సమయంలో నిత్య తప్పుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.