దర్శకుడు మృతి అంటూ ట్వీట్‌ చేసిన రచయిత‌‌.. ఖండించిన హీరో

By Satish ReddyFirst Published Aug 17, 2020, 12:50 PM IST
Highlights

దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన సహరచయిత మిలాప్‌ జవేరి ట్వీట్‌ చేయటంతో ఆ వార్త వైరల్‌గా మారింది.

సినీ ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతున్నాయి. అజయ్‌ దేవగన్‌ హీరోగా దృశ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా రచయిత మిలాప్ జవేరి ట్వీట్ చేశారు. ఆయన మృతికి లివర్‌ సిరోసిస్‌ కారణమని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన నిశికాంత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుధీర్ఘ పోస్ట్ చేశాడు మిలాప్. అయితే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ ఈ వార్తను ఖండించాడు. ప్రస్తుతం నిశికాంత్‌కు వెంటిలేటర్‌ మీద చికిత్స జరుగుతుందని, రూమర్స్‌ స్ప్రెడ్ చేయవద్దని ఆయన కోరారు. 

Requesting all the respected Media Houses who reported on to put out a clarification please. https://t.co/NPuaccKBac

— Riteish Deshmukh (@Riteishd)
click me!