1.1కోట్లు కట్టండి.. టీవీ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

By Surya PrakashFirst Published Oct 7, 2020, 5:50 PM IST
Highlights

'నిశ్శబ్ధం' చిత్రం మొన్న వీకెండ్ లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వాటిని పట్టించుకోకుండా తమ వంతుగా నిశ్శబ్దం టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు హైదరాబాద్ లోకల్ టీవి ఛానెల్ నుంచి షాక్ తగిలింది. 


ఎన్నో ఎక్సపెక్టేషన్స్, ఎదురుచూపులతో అనుష్క'నిశ్శబ్ధం' చిత్రం మొన్న వీకెండ్ లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వాటిని పట్టించుకోకుండా తమ వంతుగా నిశ్శబ్దం టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు హైదరాబాద్ లోకల్ టీవి ఛానెల్ నుంచి షాక్ తగిలింది. 
 
హైదరాబాద్ లోకల్ ఛానెల్ ఒకటి అత్యుత్సాహంతో నిశ్శబ్దం తమ టీవీ ఛానెల్ లో అతి త్వరలో ప్రసారం కాబోతోందని ప్రచారం మొదలెట్టింది. అయితే వారు ఈ చిత్రం నిర్మాతల నుంచి ఎటువంటి హక్కులు పొంది ఉండలేదు. దాంతో ఈ విషయం తెలుసుకున్న నిశ్శబ్దం టీమ్ వెంటనే రంగంలోకి దిగి తమ సినిమాకు డామేజ్ జరిగిందని, అందుకు కోటి పది లక్షలకు నష్ట పరిహారం కట్టమని లీగల్ నోటీస్ లు పంపినట్లు సమాచారం. అలాగే అమేజాన్ ప్రైమ్ సంస్ద కూడా 30 లక్షలకు లీగల్ నోటీస్ పంపినట్లు సమాచారం. 

ఆ వెబ్‌సైట్ లింక్‌ను రీట్వీట్ చేసిన దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రీసెంట్ గా ఇలాంటి సంఘటన ఒకటి తెలుగు సినీ పరిశ్రమలో  జరిగింది. సత్య దేవ్ నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' కోసం లోకల్ టీవి ఛానెల్‌పై ఈటీవీ కేసు వేసింది.  
 

click me!