అప్పుడు సమంత చేసిన పనే ఇప్పుడు నిహారిక చేస్తుంది... అంటే?

By Sambi ReddyFirst Published May 31, 2023, 5:42 PM IST
Highlights

నిహారిక విడాకులపై ఓ కన్ఫ్యూషన్ నడుస్తుంది. పరోక్షంగా హింట్ ఇచ్చారు కానీ స్పష్టత ఇవ్వడం లేదు. అయితే విడాకులకు ముందు సమంత ఎలా ప్రవర్తించిందో అలానే నిహారిక బిహేవ్ చేస్తున్నారనే వాదన మొదలైంది.

నిహారిక భర్త వెంకట చైతన్యతో గ్యాప్ మైంటైన్ చేస్తుంది. ఇద్దరికి మనస్పర్థలు తలెత్తాయని, అందుకే విడాకులు తీసుకుంటారనే టాక్ నడుస్తుంది. ఈ వార్తలకు సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. వెంకట చైతన్య మొదట పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి డిలీట్ చేశాడు. కొద్దిరోజులకు నిహారిక సైతం మ్యారేజ్ ఫొటోలు డిలీట్ చేసింది. ఇద్దరూ కలిసి కనిపించి ఏడాది కాలం అవుతుంది.

అదే సమయంలో నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె నటిగా బిజీ అవుతున్నారు. డెడ్ ఫిక్సెల్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. తన నిర్మాణ సంస్థ పేరున ఆఫీస్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం విహారాలు చేస్తుంది. నిహారిక వేకెషన్ కోసం బాలి దేశం వెళ్లారట. తన వెకేషన్ ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిహారికను సమంతతో పోల్చుతున్నారు. సమంత కూడా విడాకుల ప్రకటనకు ముందు ఇలానే చేసింది. మిత్రులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్ళింది.

డిప్రెషన్ నుండి భయట పడేందుకు సమంత ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంది. కొన్ని ఆధ్యాత్మిక టూర్స్ కి కూడా సమంత ఆ టైం లో వెళ్లారు. నిహారిక టూర్స్ కి వెళ్లడానికి కూడా కారణం విడాకులే అంటున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు చేసిన సంధి ప్రయత్నాలు బెడిసి కొట్టాయట. లాయర్స్ లీగల్ వర్క్ చేస్తున్నారట. త్వరలో విడాకుల ప్రకటన రానుంది అంటున్నారు.

ఆ విధంగా విడాకుల విషయంలో సమంత-నిహారిక మధ్య పోలిక కుదిరింది అంటున్నారు. సమంత పాత రోజులు వదిలేసి హ్యాపీ లైఫ్ గడుపుతుంది.2020 లో నిహారిక, వెంకట చైతన్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ వివాహానికి వేదిక అయ్యింది.

 

click me!