వర్సెటైల్‌ హీరోతో నయనతార రొమాన్స్.. ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్

By Aithagoni RajuFirst Published Nov 12, 2022, 9:40 AM IST
Highlights

పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల విషయంలో దూకుడు పెంచుతుంది.  ఇద్దరి పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్న నయనతార తాజాగా మరో కొత్త సినిమాకి సైన్‌ చేసిందని టాక్.

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తన ఇద్దరు కవల పిల్లలతో గడుపుతుంది. మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తుంది. ఇటీవల నయనతార-విఘ్నేష్‌ జంట సరోగసి ద్వారా కవల పిల్లలను పొందిన విషయం తెలిసిందే. మ్యారేజ్‌ అయి నాలుగు నెలల్లోనే వారు పేరెంట్స్ కావడం విశేషం. ఇది ఆశ్చర్యంగా, మరికొంత వివాదంగా మారిన విషయం తెలిసిందే. 

ఈ విషయాలు పక్కన పెడితే నయనతార కెరీర్‌ పరంగా బిజీగానే ఉంది. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. ప్రస్తుతం ఆమె హిందీలోకి ఎంట్రీ ఇస్తూ షారూఖ్‌ ఖాన్‌తో `జవాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర శరవేగంగా చిత్రీకరన జరుపుకుంటోంది. ఇందులో షారూఖ్‌, నయనతారల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందట. ఇంటెన్స్ రోల్స్ లో నయనతార ఇరగదీస్తుంది. ఇందులోనూ అలాంటి పాత్రలో కనువిందు చేయబోతుందని టాక్. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాకి సైన్‌ చేసిందట. విలక్షణ నటుడు ఆర్‌ మాధవన్‌తో కలసి ఓ సినిమా చేయబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శశికాంత్‌ దర్శకత్వంలో మాధవన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా చేయబోతుందని టాక్‌. ఇందులో హీరో సిద్ధార్థ్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇద వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తుంది. 

ఇటీవల తెలుగులో చిరంజీవితో `గాడ్‌ ఫాదర్‌`లో నటించింది నయనతార. `సైరా`లో ఆయనకు జోడీగా చేసి, `గాడ్‌ ఫాదర్‌`లో ఆయనకు సిస్టర్ గా చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో `జవాన్‌`తోపాటు మలయాళంలో `గోల్డ్`, తమిళంలో `కనెక్ట్`, `ఇరైవన్‌`తోపాటు మరో చిత్రం ఉంది. మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతుందనే రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమాలకు నయన్‌ సైన్‌ చేయడం విశేషం. సో రెండింటిని ఆమె బ్యాలెన్స్ చేయబోతుందని అర్థమవుతుంది.  
 

click me!