నయనతార, విఘ్నేష్‌లకు కరోనా..? సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన హాట్ కపుల్‌

By Satish ReddyFirst Published Jun 22, 2020, 4:08 PM IST
Highlights

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, ఆమె బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లకు కూడా కరోనా సోకిందన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌ ఈ వార్తలో వైరల్‌ కావటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన అభిమాన నటికి ఎలా ఉందో తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నయన్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పెడుతున్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశ వ్యాప్తంగా రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్ర స్థాయిలోనే ఉన్నా తమిళనాట మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు కూడా కరోనా సోకిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, ఆమె బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లకు కూడా కరోనా సోకిందన్న ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్‌ ఈ వార్తలో వైరల్‌ కావటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన అభిమాన నటికి ఎలా ఉందో తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నయన్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ విషయం నయన్‌, విఘ్నేష్‌ల వరకు చేరటంతో వారు క్లారిటీ ఇచ్చారు. తమకు కరోనా సోకినట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు విఘ్నేష్‌.

తాము హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నాం అంటూ అభిమానులకు తెలిసేలా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు విఘ్నేష్‌ శివన్. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో యమా బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్‌, ముక్తి అమ్మాన్‌, అన్నాట్టే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.

click me!