సైదాబాద్ చిన్నారి హత్యాచార సంఘటన సగటు పౌరుల హృదయాలు కలచివేస్తోంది. సెలెబ్రిటీలు సైతం ఈ సంఘటనపై స్పందిస్తూ నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచార సంఘటన సగటు పౌరుల హృదయాలు కలచివేస్తోంది. సెలెబ్రిటీలు సైతం ఈ సంఘటనపై స్పందిస్తూ నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరేళ్ళ చిన్నారిపై అత్యంత అమానుషంగా ప్రవర్తించి హత్యాచారం చేసిన రాజు బ్రతికి ఉండకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు.
సినీ హీరో మంచు మనోజ్ స్వయంగా స్పందించి ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్, బైక్ పై కాకుండా మీడియా ఇలాంటి సంఘటనలపై ఫోకస్ పెట్టాలని మనోజ్ సూచించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక సమాజంగా మనం ఎంత దిగజారిపోతున్నామో అనేది గుర్తు చేసుకోవాలి అని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలియజేసిన వారికి పోలీసులు 10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సంఘటనపై స్పందించాడు.
సింపుల్ కామెంట్ తో నాని రియాక్షన్ వైల్డ్ గా ఉంది. పోలీసులు నిందితుడి వివరాలు ఆనవాళ్లు తెలియజేస్తూ.. ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డ్ అని ట్వీట్ చేశారు. దీనిపై నాని స్పందిస్తూ.. 'బయటెక్కడో ఉన్నాడు.. వుండకూడదు' అంటూ వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.
నిందితుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. అప్రమత్తంగా ఉండండి.. తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.
బయటెక్కడో ఉన్నాడు
వుండకుడదు https://t.co/yyiuvM6HP1
The culprit is still roaming around,
Be aware and inform the Police.
Spread maximum!! pic.twitter.com/827soO0plb