సీనియర్ నటుడు నరేష్ - పవిత్రా లోకేష్ జంగా ఓ చిత్రం రాబోతోంది. కన్నడ - తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస రాయ డాక్టర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ జంటగా కొత్త సినిమా రాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ ను అలాగే రిలీజ్ పైనా అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కథ అందించడంతో పాటు డైరెక్ట్ చేశారు.
అయితే, విజయకృష్ణ బ్యానర్ 50 స్వర్ణ సంవత్సరాలు, అలాగే నటుడిగా నరేష్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు మరియు కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ Vijay Krishna Movies నరేష్ పునరుద్ధరించడటం విశేషం. ఈ సందర్భంగా చిత్రం టైటిల్తో పాటు ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్లో సాంప్రదాయ దుస్తులలో నరేష్ - పవిత్రా ఆకట్టుకుంటున్నారు. గ్లింప్స్ లో పవిత్రా తమ ఇంటి ముందు ముగ్గేస్తుంటే నరేష్ దగ్గరగా వచ్చి చూసే సీన్ ఆకట్టుకుంటోంది.
ఫస్ట్లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీంతో సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అర్థం అవుతోంది. నరేష్ - పవిత్ర బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వినసొంపుగా ఉంది. చిత్రంలో జయసుధ, శరత్బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఆయా పాత్రల్లో అలరించబోతున్నారు.
అదేవిధంగా సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కాకపోతే కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. మున్ముందు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి షూటింగ్ పూర్తైంది. యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లింది.
విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ను పునరుద్ధరిస్తున్న సందర్భంగా నరేష్ ఆషక్తికర ప్రకటన విడుదల చేశారు... నోట్ లో.,. సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ, కళావాహిని డాక్టర్ విజయ నిర్మల కలిసి చేసిన సినీ ప్రయాణం ఒక చరిత్ర. అందులోని ఓ ముఖ్య అధ్యాయమే విజయకృష్ణ మూవీస్. 1973లో వాళ్లిద్దరూ ఈ డ్రీమ్ బ్యానర్ ను స్థాపించారు. మీనా, కవిత, హేమా హేమీలు, అంతం కానిది ఆరంభం.. లాంటి రెబలిస్టిక్ మరియు కమర్షియల్ చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. మళ్లీ 50 గోల్డెన్ ఇయర్స్ సందర్భంగా తిరిగి పునరుద్ధరించామన్నారు. తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంలో తొలిచిత్రంగా ‘మళ్లీ పెళ్లి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
A beautiful project to celebrate the glorious 50th anniversary of 🤩
Here’s the 1st Look of my next ❤️
Telugu - https://t.co/evdIERyqDm
Dir by
Co starring 😍
Summer 2023 Release! pic.twitter.com/vnYic52UdW