
నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రం బ్రీత్. గత ఏడాది డిసెంబర్ లో ఈ మూవీ విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి కనీస ఆదరణ దక్కలేదు బ్రీత్ జీరో షేర్ రాబట్టి దారుణమైన పరాజయం మూటగట్టుకుంది. కనీసం నందమూరి అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చూడలేదు. బ్రీత్ విడుదలై చాలా కాలం అవుతుంది. అయినా ఓటీటీలోకి రాలేదు. ఎట్టకేలకు ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
మార్చి 8 నుండి బ్రీత్ ఆహాలో స్ట్రీమ్ కానుంది. బ్రీత్ చిత్రానికి వంశీ ఆకెళ్ళ దర్శకుడు. చైతన్య కృష్ణ తండ్రిగారైన జయకృష్ణ స్వయంగా నిర్మించారు. బ్రీత్ కథ విషయానికి వస్తే... రాష్ట్ర సీఎం ని కొందరు చంపాలని చూస్తారు. ఒక సామాన్యుడు సీఎం ని ఎలా కాపాడాడు అనేదే కథ.
చైతన్య కృష్ణ బ్రీత్ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేశాడు. బాలకృష్ణ కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అయినా మూవీని ఎవరు పట్టించుకోలేదు. దాంతో దారుణమైన రికార్డు సొంతం చేసుకుంది. థియేటర్స్ లో బ్రీత్ సినిమాకు ఆదరణ దక్కలేదు. మరి ఓటీటీలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.