నెపోటిజాన్ని సమర్థించిన నాగబాబు.. ఏమన్నాడంటే ?

Published : Aug 28, 2020, 04:02 PM IST
నెపోటిజాన్ని సమర్థించిన నాగబాబు.. ఏమన్నాడంటే ?

సారాంశం

టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ హాట్‌ హాట్‌గా సాగుతుంది. చాలా మంది తారలు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలుతున్నారని, కొత్త వారిని రాణివ్వడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత దీనిపై చర్చ మరింత ఊపందుకుంది. ఓ ఉద్యమంలాగానే సాగుతుంది. 

అయితే టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం, తమ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితిపై ఆయన మాట్లాడారు. 

పరోక్షంగా నెపోటిజాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో నాగబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ ఫ్యామిలీ గురించి చెబుతూ, ఎన్టీఆర్‌ కొడుకు కావడంతో బాలకృష్ణ స్టార్‌ అయ్యారనడం సరికాదు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సాధించారు. ఏఎన్నార్‌ కొడుకు కాబట్టి నాగార్జునని ఆడియెన్స్ చూడలేదు. తన గ్లామర్‌తో కింగ్‌గా ఎదిగారు. మన్మథుడిగా అలరించారు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంత కష్టపడతాడో తాను స్వయంగా చూశానని చెప్పాడు.  `అరవింద సమేత` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్‌ సీన్‌ చేశాడని నాగబాబు తెలిపారు. 

మహేష్‌ గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు సినిమాల్లోకి రాకముందు కాస్త లావుగానే ఉండేవాడని, హీరోగా నటించాలనుకున్నప్పుడు కేబీఆర్‌ పార్క్ లో రోజూ రన్నింగ్‌ చేసేవాడని, చాలా స్లిమ్‌గా తయారయ్యాడని చెప్పాడు. కష్టపడకపోతే ఎవరికీ చిత్రపరిశ్రమలో స్థానం ఉండదని, దేవుడి కొడుకైనా.. అతడు నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. 

ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ, తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడిన తర్వాతే తెరపైకి వచ్చారని చెప్పారు. బన్నీ, చరణ్‌, వరుణ్‌, సాయితేజ్‌, నిహారికా ఇలా అందరు కెరీర్‌ ఓసం కష్టపడుతున్నారని, నటులుగా నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడుతున్నట్టు చెప్పారు.

చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాక, నాగబాబుని, పవన్‌ కళ్యాణ్‌ని, ఆ తర్వాత వారి వారసత్వాన్ని, అలాగే అల్లు రామలింగయ్య నుంచి అల్లు అరవింద్‌, ఆయన్నుంచి అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ వంటి వారు హీరోలుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో సగం మంది మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?