ఆరెంజ్, జల్సా తర్వాత గుడుంబా శంకర్.. రీ రిలీజ్ ఆదాయాన్ని జనసేనకి విరాళం ఇచ్చిన నాగబాబు

Published : Dec 14, 2023, 06:29 PM IST
ఆరెంజ్, జల్సా తర్వాత గుడుంబా శంకర్.. రీ రిలీజ్ ఆదాయాన్ని జనసేనకి విరాళం ఇచ్చిన నాగబాబు

సారాంశం

పవన్ కళ్యాణ్, మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాను రీరిలీజ్ చేసిన చిత్రాల ఆదాయాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని నాగబాబు గతంలో ప్రకటించారు.

మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కి వెన్నుదన్నుగా ఉంటున్నారు. నాదెండ్ల మనోహర్ తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల్ని చూసుకుంటోంది నాగబాబే. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఒక ఊపు ఊపుతోంది. 

పవన్ కళ్యాణ్, మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాను రీరిలీజ్ చేసిన చిత్రాల ఆదాయాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని నాగబాబు గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా నాగబాబు.. గుడుంబా శంకర్ చిత్రం రీ రిలీజ్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంలో అధిక భాగాన్ని జనసేన పార్టీకి అందించారు. రూ.35 లక్షల చెక్ ని నాగబాబు జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కి అందించారు. 

ఈ దృశ్యాలని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో నాగబాబు తన నిర్మాణంలో తెరకెక్కిన రాంచరణ్ ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఆ చిత్ర రీ రిలీజ్ లో  వచ్చిన ఆదాయంలో 1.05 కోట్లు నాగబాబు జనసేనకి ఇచ్చారు. 

అలాగే జల్సా చిత్ర రీరిలీజ్ అమౌంట్ ని కూడా జనసేనకు అందించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడాలని నాగబాబు కోరారు. 

 

PREV
click me!

Recommended Stories

NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత