విరాటపర్వం దర్శకుడితో నాగ చైతన్య పొలిటికల్ థ్రిల్లర్?

By Sambi ReddyFirst Published Oct 17, 2022, 11:57 AM IST
Highlights

నాగ చైనత్య మరో కొత్త ప్రాజెక్ట్ ఒకే చేసినట్లు తెలుస్తుంది. ఈసారి ఆయన పొలిటికల్ థ్రిల్లర్ ఎంచుకున్నారట. విరాటపర్వం ఫేమ్ వేణు ఉడుగుల దర్శకుడంటూ వార్తలు వస్తున్నాయి. 
 

హీరో నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ శివ షేడ్స్ లో ఆ మూవీ తెరకెక్కింది. రాజకీయ నాయకులు, మాఫియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటారో, నాశనం చేస్తారో శివ సినిమాలో చూపించారు. దాదాపు అదే కాన్సెప్ట్ మనం జోష్ మూవీలో చూడొచ్చు. తర్వాత మళ్ళీ నాగ చైతన్య పూర్తి స్థాయి పొలిటికల్ జోనర్స్ ట్రై చేయలేదు. 

చాలా గ్యాప్ తర్వాత చైతు పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. విరాటపర్వం ఫేమ్ వేణు ఉడుగులతో ఆయన ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారట. రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కలిసి దేశాన్ని ఎలా దోచేస్తున్నారనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కనుందట. వేణు ఉడుగుల స్క్రిప్ట్ కి ఇంప్రెస్ అయిన నాగ చైతన్య రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారు అంటున్నారు. 

ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే పరిశ్రమలో ఈ కాంబినేషన్ గురించి ప్రముఖంగా వినిపిస్తోంది. వేణు ఉడుగుల డెబ్యూ మూవీ విరాటపర్వం కమర్షియల్ గా ఆడకున్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి నాగ చైతన్య మూవీతో వేణు విజయం అందుకుంటారో లేదో చూడాలి. మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటిస్తున్న మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. నాగ చైతన్య 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

click me!