నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్!

By AN TeluguFirst Published Jun 22, 2019, 11:43 AM IST
Highlights

దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది.

దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది. పాండవర్ జట్టు, స్వామి శంకర్ దాస్ జట్టులు వాగ్వాదానికి దిగాయి. నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులో ఓ అధికారి మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం నాడు ఈ రిట్ పిటిషన్ పై విచారణ జరపగా.. అనుకున్న ప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెల్లడించింది.

అయితే ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్ జట్టు హర్షం వ్యక్తం చేసింది.  

click me!