ఈ చిత్రం నైజాం రైట్స్ ని మైత్రీ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఓ రకంగా దిల్ రాజు నుంచి నైజాం ఏరియా సినిమాలు మెల్లిగా మైత్రీ వారు సొంతం చేసుకుంటన్నట్లు అర్దమవుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం హనుమాన్ (హను-మాన్) . ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్దాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన హనుమాన్ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, పండగకు చాలా సినిమాలు పోటీలో ఉండటంతో హనుమాన్ను వాయిదా వేయాలని ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, హనుమాన్ను అనుకున్న విధంగా జనవరి 12వ తేదీనే తీసుకురావాలని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నైజాం రైట్స్ ని మైత్రీ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్ నిమిత్తం ₹7.2 కోట్లు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం. ఓ రకంగా దిల్ రాజు నుంచి నైజాం ఏరియా సినిమాలు మెల్లిగా మైత్రీ వారు సొంతం చేసుకుంటన్నట్లు అర్దమవుతోంది. ఇన్నాళ్లూ మోనీపలిగా ఉన్న దిల్ రాజుకు మైత్రీ కౌంటర్ ఇస్తోందని అంటున్నారు. ఇక మైత్రీవారు ఈ రేటు ఇవ్వటంతో మిగతా ఏరియాలు కూడా మంచి రేట్లకు బిజినెస్ అవుతున్నాయి. రీసెంట్ గా మైత్రీవారు ప్రభాస్ సలార్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇప్పుడు మరో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర ఒకటి ఉంది. సినిమా అంతటా ఈ కోతి పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వటం హైలెట్ గా చెప్తున్నారు. ఈ పాత్ర, రవితేజ గొంతులోని ఫన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయని చిత్ర టీమ్ చెబుతోంది.
మరో ప్రక్క 2024 సంక్రాంతికు పోటీ ఓ రేంజిలో ఉంది. సంక్రాంతి రిలీజ్ కోసం తెలుగు స్టార్ హీరోలంతా తమ సినిమాలతో ఆల్రెడీ కర్ఛీప్ వేసేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే బయ్యర్లు మాత్రం గోలెత్తిపోతున్నారు. మరో ప్రక్క థియేటర్స్ సమస్య వస్తుంది. నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.