గ్రాండ్‌గా `ట్రిబ్యూట్‌ టూ ఇళయరాజా` ఈవెంట్.. మృణాల్‌ ఠాకూర్‌తోపాటు తారల సందడి..

Published : Feb 26, 2023, 02:33 PM IST
గ్రాండ్‌గా `ట్రిబ్యూట్‌ టూ ఇళయరాజా` ఈవెంట్.. మృణాల్‌ ఠాకూర్‌తోపాటు తారల సందడి..

సారాంశం

మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా నేడు హైదరాబాద్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. శనివారం ఆయనకు ట్రూబ్యూట్‌ టూ ఇళయరాజా పేరుతో ఏర్పాటు చేసిన సభ గ్రాండ్‌గా జరిగింది.

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా నేడు(ఆదివారం) హైదరాబాద్‌లో మ్యూజిక్‌ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ముందస్తుగా శనివారం సాయంత్రం `ట్రి బ్యూట్‌ టూ ఇళయరాజా` పేరుతో మ్యూజికల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ జరిగింది. ఎన్నో విజయవంతమైన ఈవెంట్స్ చేసిన హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ జరిగింది.

ఇళయరాజ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు ఆలపించారు. శ్రోతలను ఉర్రూతలూగించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సంగీత గానంతో అలరించారు. అందరిని ఒక్కసారిగా వెనక్కి తీసుకెళ్లారు. కంటిన్యూగా నాలుగు గంటలపాటు మ్యూజిక్‌ షో అద్యంతం అలరించింది. ఇందులో తెలుగు సినీరంగ ప్రముఖులు సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో దిగ్గజ రైటర్‌, ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. వారితోపాటు దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినిదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరిరామజోగయ్య శాస్త్రి, నిర్మాత సీ.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, `సీతారామం` ఫేమ్‌ మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు.. వంటి వారు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజ 80ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్ తో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఇళయరాజా సంగీతాన్ని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఇళయరాజా తన మ్యూజికల్‌ కాన్సర్ట్ ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?