‘ఫ్యామిలీతో విహారయాత్ర.. శృతి హాసన్ తో వీరయ్య యాత్ర’.. వైరల్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్.!

By team teluguFirst Published Dec 8, 2022, 5:14 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విహార యాత్రకు బయల్దేరిన చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Valtair Veerayya).వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సరిగ్గా నెల సమయం ఉంది. ఈ క్రమంలో చిత్ర షూటింగ్ పూర్తైయింది.  కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని మొత్తం ఫారెన్ లోనే చిత్రకరించబోతున్నట్టు సమాచారం. ఇందుకు కోసం ‘వాల్తేరు వీరయ్య’ టీం సాంగ్ చిత్రీకరణ కోసం విదేశాలకు బయల్దేరింది. 

రెండు సాంగ్స్ ను దాదాపు 15 రోజుల్లో షూట్ చేయనున్నట్టు సమాచారం. దీంతో ఈ రోజు చిత్ర యూనిట్ విదేశాలకు బయల్దేరింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) కూడా వెళ్లింది. ఈ క్రమంలో రెండు వారాల పాటు ఫారెన్ లోనే ఉండాల్సి రావడంతో..  చిరంజీవి పనిలో పనిగా కుటుంబంతోనూ విహార యాత్రనూ ప్లాన్ చేశారు. దీనిపై స్వయంగా చిరంజీవినే స్వయంగా అప్డేట్ అందించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. రెండు ఫొటోలను పంచుకున్నారు. ఒకటి ఫ్యామిలీతో కలిసి ఉన్నదైతే.. మరొకటి శ్రుతి హాసన్ తో  కలిసి ఉన్నది. ఈ రెండు ఫొటోలను పంచుకుంటూ చిరంజీవి ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చారు. ‘ఫ్యామిలీ తో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర’ అంటూ ఫొటోలను వర్ణించారు. ఈ టూర్ కంప్లీట్ అయ్యాక.. చిరంజీవి నేరుగా ‘వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లోనే పాల్గొననున్నారు. 

మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్ లో ఊరమాస్ యాక్షన్ తో అలరించబోతున్నారు. మెగాస్టార్  సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ఆడిపాడుతోంది. మాస్ మహారాజ రవితేజ (Raviteja) కీలక పాత్రను పోషించడం మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన  పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అదిరిపోయాయి. రీసెంట్ గా వచ్చిన ‘బాస్ పార్టీ’ సాంగ్ కూ ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కుతోంది.  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

ఫ్యామిలీ తో అటు విహార యాత్ర

హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 pic.twitter.com/EnhJxSlFq4

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!