దేశం కాని దేశంలో భార్య ఉపాసన కోసం ఆమ్లెట్లు వేస్తున్నాడు మెగా పవర స్టార్ రామ్ చరణ్. ఉపాసనతో కలిసి రొమాంటిక్ టూర్ లో ఉన్నాడు చరణ్. సరదాగా గడిపేస్తున్నాడు. ఇంతకీ ఇద్దరు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు టాంజానియా అందాలను ఆస్వాదిస్తున్నారు. కొన్నాళ్ళు సినిమాలు, టెన్షన్లకు దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించే పనిలో ఉన్నారు మెగా జంట. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ వారం పాటు జపాన్ లో సందడి చేసిన రామ్ చరణ్.. అక్కడ పర్యటన ముగించుకుని డైరెక్ట్ గా టాంజానియా ప్లైట్ ఎక్కారు. ఇక ఓ ఉద్యాన వనంలో.. జంతువులను చూసుకుంటూ.. ప్రకృతి ఒడిలో సేదతిరుతున్నారు స్టార్ కపుల్.
ఇక టాంజానియాలో రైడ్ చేశాడు రామ్ చరణ్.. ఓపెన్ టాప్ జీప్ ను రామ్ చరణ్ నడుపుతుంటే, పక్కనే ఓ చిన్నారి కూర్చున్నాడు. ఆ తర్వాత అక్కడ టూర్ లో భాగంగా ఓపెన్ ప్లేస్ లో ఏర్పటు చేసిన కిచెన్ లో .. స్టవ్ పై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఇదంతా టాంజానియా సఫారీలో భాగమని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సాయంగా కొందరు స్థానికులు వెంట ఉన్నారు. టూర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చరణ్.
మరో వైపు రామ్ చరణ్ జీప్ నడుపుతున్న వీడియో క్లిప్ ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఏదో వన్యప్రాణి క్రేంద్రం అభయారణ్యంలో చరణ్ రైడ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే అదే జీప్ నుంచి కెమెరాతో సమీపంలోని సింహాన్ని ఫొటో తీయడాన్ని కూడా ఈ వీడియోలు చూడవచ్చు. దీనికి సబంధించిన వీడియోను ఉపాసన షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక టాంజానియా టూర్ కంటే ముందు జపాన్ లో హడావిడి చేశాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 21న జపాన్ లో రిలీజ్ అయ్యింది. జపాన్ లో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోయింది మూవీ. చరణ్ దంపతులతో పాటు.. ఎన్టీఆర్ దంపతులు కూడా జపాన్ లో సందడి చేశారు. జపాన్ లో కూడా రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు స్టార్ కపుల్.