కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ, విష్ణు బీజేపీలోకి వెళ్తున్నారా..? ఏందుకు కలిశారు

By Mahesh JujjuriFirst Published May 15, 2022, 9:49 AM IST
Highlights

మా అసోయియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు సడెన్ గా కేంద్ర సాంసృతిక పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాని ఆ వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు. 
 

కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్  అధ్య‌క్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అయితే  ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడార‌న్న వివ‌రాలు మాత్రం వెల్ల‌డి కాలేదు. మంచు విష్ణు త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కార్యాలయం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. 

అయితే ఈ భేటీకి సంబంధించిన  పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. అసలు మంచు విష్ణు కేంద్ర మంత్రిని ఎందుకు కలిశారన్న దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. మంచు విష్ణు హీరోగా.. కేంద్ర మంత్రిని కలిసి ఉంటే.. మర్యదపూర్వకంగా భేటీ అనుకోవచ్చు కాని విష్ణు మా అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. అందులోనే ఆయన కలిసింది సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిని.   అసోసియేషన్ కోసంఏదైనా అడిగారా అంటే.. ఆ విషయం అఫీయల్ గాబయటకు వచ్చేదిగా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

 

MAA - Movie Artist Association president Shri called on Hon Union Minister Shri in Hyderabad today. pic.twitter.com/EdBfS2VUyS

— Office of G. Kishan Reddy (@KishanReddyOfc)

 

అయితే రీసెంట్ గా మంచు విష్ణు తిరుపతిలో స్టూడియోలు కడతా అన్ని అన్నారు. ఆ విషయం గురించి మంత్రితో మాట్లాడి ఉంటారా.. ఏక రీసెంట్ గా యూనివర్సిటీ హోదా వచ్చిన తన విద్యాసంస్థల విషయంలో ఏదైనా అడిగి ఉంటారా అని బయట చర్చలుజరుగుతున్నాయి.  

వీరి భేటీపై మరో వాదన కూడా జరుగుతుంది. మంచు విష్ణు బిజేపిలో చేరబోతున్నారని. దానికోసమే ఆయన కిషన్ రెడ్డితో భేటీ అయ్యారని మరో పొలిటికల్ గాసిప్ గట్టిగా నడుస్తోంది. ఏది ఏమైనా.. మంచు విష్ణు సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిషణ్ రెడ్డిని కలవడం ఇప్పుడు చర్యనీయాంశం అయ్యింది. 
 

click me!