మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

By Udayavani DhuliFirst Published Oct 27, 2018, 3:44 PM IST
Highlights

ఈ ఏడాది వరుస పరాజయాలతో నిర్మాత దిల్ రాజు డీలా పడ్డాడు. సాధారణంగా అతడి సినిమాలకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. ప్రమోషన్స్ తో ఏదోకవిధంగా  సినిమాను గట్టేక్కించేస్తాడు. కానీ ఈ ఏడాదిలో దిల్ రాజు ప్లాన్ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. దీంతో వచ్చే ఏడాది మహేష్ బాబుతో చేస్తోన్న 'మహర్షి' సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ఏడాది వరుస పరాజయాలతో నిర్మాత దిల్ రాజు డీలా పడ్డాడు. సాధారణంగా అతడి సినిమాలకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. ప్రమోషన్స్ తో ఏదోకవిధంగా  సినిమాను గట్టేక్కించేస్తాడు. కానీ ఈ ఏడాదిలో దిల్ రాజు ప్లాన్ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. దీంతో వచ్చే ఏడాది మహేష్ బాబుతో చేస్తోన్న 'మహర్షి'  సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా ఓ రేంజ్ లో చేయాలనేది దిల్ రాజు ఆలోచన. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.25 కోట్లకి అమ్మాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్మాలంటే.. సినిమాలో సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ కంటే యాక్షన్ ఎక్కువ శాతం ఉండాలి. కానీ 'మహర్షి' సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు రెండు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో దిల్ రాజు, మహేష్ ల మధ్య దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లిని సినిమాలో మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారట. కానీ మహేష్ బాబు మాత్రం దానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది.

యాక్షన్ కథకి తగ్గట్లు ఉండాలని దానికోసం స్పెషల్ గా సీన్స్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాడట. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం సినిమాలో యాక్షన్ సీన్స్ పెట్టడం మంచిది కాదనేది మహేష్ అభిప్రాయం. మరేం జరుగుతుందో చూడాలి!

click me!