మనసు మార్చుకున్న మహేష్, 'మహర్షి'కి ప్లస్

By Udaya DFirst Published Apr 3, 2019, 9:27 AM IST
Highlights

మహేష్ బాబు మొదటి నుంచీ తన చిత్రాల డబ్బింగ్ విషయంలో మిగతా హీరోలకు భిన్నంగా వెళ్తున్నారు. 

మహేష్ బాబు మొదటి నుంచీ తన చిత్రాల డబ్బింగ్ విషయంలో మిగతా హీరోలకు భిన్నంగా వెళ్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక..ఇక ఆ టెన్షన్ లేదనుకున్నాక,కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం కూల్ గా  డబ్బింగ్ మొదలెడతూంటారు. దాదాపు ప్రతీ సినిమా కు ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. 

మిగతా హీరోలు...షూటింగ్ భాగం పూర్తవుతుందనగానే మొదలెట్టేసారు. ఓ ప్రక్క షూటింగ్ ..మరో ప్రక్క గ్యాప్ లో డబ్బింగ్ పూర్తి చేస్తూంటారు. అయితే ఈ సారి మహేష్ మనస్సు మార్చుకున్నారు. తన పద్దతికి బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.

ఇంకా కొద్దిగా షూటింగ్ పార్ట్ ఉందనగానే డబ్బింగ్ స్టార్ట్ చేసేసారు. రిలీజ్ కు టైమ్ ఉన్నా పనులు పరుగెట్టిస్తున్నారు. అందుకు కారణం ...సినిమాలో తన క్యారక్టర్  రకరకాల టైమ్ జోన్స్  లో జరుగుతుందని, అందుకు తగ్గట్లే తన వాయిస్ మాడ్యులేషన్స్ మార్చుకోవాల్సి వస్తుందని గమనించి, ఫెరఫెక్షన్ రావాలంటే కంటిన్యూగా డబ్బింగ్ చెప్పటం ...మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ సరిచూసుకుంటూ వెళ్లాలని ఫిక్స్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. 

దాంతో మహర్షి టీమ్ ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. అది మహేష్ డెడికేషన్ తప్ప వేరేది కాదని, ఆయన మొదట నుంచి తన పాత్రలోకి  పరకాయ ప్రవేశం చేసినట్లుగా చేసారని, ఇప్పుడు తన వాయిస్ తో జీవం పోస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా ఓ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చే లక్షణాలు కనపడతున్నాయి కదా.

మహేష్ బాబు మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.  అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కాబోతున్నది.  

click me!