మహేశ్ బాబు సూపర్ కూల్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్.. ప్రత్యేకత ఏంటో తెలుసా.!

By team teluguFirst Published Sep 20, 2022, 6:22 PM IST
Highlights

ఫ్యాన్స్ ను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu). ఇప్పటికే ‘ఎస్ఎస్ఎంబీ 28’పై అప్డేట్స్ ఇస్తూనే.. మరోవైపు నయా లుక్ లో అదిరిపోయే పిక్స్ ను షేర్ చేస్తున్నారు. తాజాగా మరో పిక్ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  ప్రస్తుతానికి SSMB28 వర్క్ టైటిల్ పేరుతో శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఇటిప్పటికే చిత్రం నుంచి అందుకున్న సమచారం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇటీవల క్రేజీ వీడియోను కూడా పంచుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహశ్ బాబు కూడా ఫ్యాన్స్ ను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ 28’ కోసం సూపర్ స్టార్ పూర్తిగా తన లుక్ ను మార్చిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల వరుసగా న్యూ లుక్ లో ఫొటోలను వదులుతూ ఆశ్చర్య పరుస్తున్నారు. 

తాజాగా మరో సెల్ఫీ పిక్ ను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఐ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ ‘ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్’ మొబైల్ లో సెల్ఫీ దిగడం ప్రత్యేకతగా మారింది. స్కైబ్లూ టీషర్ట్ ధరించిన మహేశ్ బాబు సూపర్ కూల్ లుక్ లో సెల్ఫీ దిగారు. ఆ పిక్ ను అభిమానులతో పంచుకుంటూ ‘రెస్ట్ అండ్ రీచార్జ్’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ లుక్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ పిక్ ను వైరల్ చేస్తున్నారు. సినిమా కోసం మహేశ్ బాబు కొద్దిపాటిగా గడ్డం, మీసాలు పెంచుతుడంతో మాస్ లుక్ ను సొంతం చేసుకున్నారు. 

అదేవిధంగా మహేశ్ బాబు న్యూ లుక్ లో పలు క్లాతింగ్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా ఫొటోషూట్లు చేయడం అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం లుక్ తోనే ఇంత రచ్చ చేస్తుంటే.. ఇక సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు సరసన హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ఆడిపాడనుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

click me!