రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్, సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ కారణంగా మొదట రోజు చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత డ్రాపైంది. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా భారీ స్దాయిలో రిలీజైంది. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. వారికి ఇది శుభవార్త.
ఈ సినిమాను ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ Hotstar) వారు కొనుగోలు చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిలీజైన నెల లోపలే ఈ సినిమా ఓటిటిలో ప్రత్యక్ష్యం కానుండటం విశేషం.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి ఈ స్పోర్ట్స్ డ్రామాను చిత్రబృందం జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడంతో అన్ని భాషల్లో భారీగా అడ్వాన్స్ డ్ బుక్సింగ్స్ వచ్చాయి. దాంతో, బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. కానీ, మధ్యాహ్నంలోపే రివ్యూలు బయటికి రావడం, బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ మౌత్ టాక్ రావడం ప్రతికూల ప్రభావం చూపింది.
లైగర్' విడుదలకు ముందు చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని విజయ్ దేవరకొండ అభిమానులు కొందరు అంటున్నారు. దేశంలో వివిధ నగరాలు తిరగడం... గొప్పగా సినిమా గురించి చెప్పడం వల్ల అంచనాలు పెరిగాయని, దాంతో ప్రేక్షకులు అతిగా ఊహించుకుని థియేటర్లకు వచ్చారని, ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ఫ్లాప్ టాక్ వచ్చిందని అంటున్నారు.ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.