సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్.. స్పెయిన్ వెళ్లనున్న మహేష్!

By team teluguFirst Published Sep 17, 2021, 12:26 PM IST
Highlights

సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్ నెలాఖరుకి స్పెయిన్ వెళ్లనున్న చిత్ర బృందం, దాదాపు నెల రోజులు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారట.


సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. 2022 సంక్రాంతి బరిలో దిగనున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు విపరీతంగా నెలకొని ఉన్నాయ్. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడంతో పాటు, సంక్రాంతి బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు మహేష్. దీనితో మరోమారు సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని, గట్టి ప్రయత్నంలో ఉన్నారు. 

ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న విధంగా మూవీ షూటింగ్ పూర్తి కాలేదు. దుబాయ్ షెడ్యూల్ తరువాత భారీ గ్యాప్ వచ్చింది. దీనితో షూటింగ్ త్వరగా ముగించాలని యూనిట్ భావిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్, గోవా షెడ్యూల్స్ ముగియగా, నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్ నెలాఖరుకి స్పెయిన్ వెళ్లనున్న చిత్ర బృందం, దాదాపు నెలరోజు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారట. 


ఈ షెడ్యూల్ నందు టాకీతో పాటు ఒకటి రెండు సాంగ్స్ చిత్రీకరణ జరపనున్నారనేది సమాచారం. ఇక చివరి షెడ్యూల్ డిసెంబర్ కల్లా ముగించి, సర్కారు వారి పాట అనుకున్న విధంగా సంక్రాంతి బరిలో దింపాలనేది ప్రణాళిక. మరోవైపు సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ లుక్ సరికొత్తగా ఉంది. దర్శకుడు పరుశురాం ఆయన పాత్ర భిన్నంగా రూపొందించారని వినికిడి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!