నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది తారక్.. మహేష్ ఎమోషనల్ ట్వీట్!

Published : Aug 29, 2018, 11:13 AM ISTUpdated : Sep 09, 2018, 12:13 PM IST
నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది తారక్.. మహేష్ ఎమోషనల్ ట్వీట్!

సారాంశం

నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు.

నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. హరికృష్ణకి నివాళులు అర్పించిన మహేష్ బాబు.. ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

''సడెన్ గా హరికృష్ణ గారు మరణించడం ఎంతో బాధకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నా బలం, ప్రేమ నీకు ఎప్పటికీ ఉన్నాయి బ్రదర్ తారక్'' అంటూ ట్వీట్ చేశారు. అలానే సినీ హీరోలు నాని, సందీప్ కిషన్, దర్శకుడు అనీల్ రావిపూడి, హారిక హాసిని క్రియేషన్స్ ఇలా విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నందమూరి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ హరికృష్ణకి నివాళులు అర్పిస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్