'మహర్షి' తొలి పాట విన్నారా..?

By Udaya DFirst Published Mar 29, 2019, 9:52 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి'. ఈ సినిమాలో తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి'. ఈ సినిమాలో తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే' అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈరోజు నుండి 'మహర్షి' మ్యూజికల్ జర్నీ మొదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 

ముగ్గురు స్నేహితుల మధ్య చోటు చేసుకునే సన్నివేశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!