గుమ్మడి కాయ కొట్టిన మహాసముద్రం టీమ్!

By team teluguFirst Published Jul 9, 2021, 2:40 PM IST
Highlights

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మహాసముద్రం మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో షూటింగ్స్  ఊపందుకున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ చివరి దశలో ఉండగా, కొన్ని చిత్రాలు పూర్తి చేశారు. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మహాసముద్రం మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. శర్వా, సిద్దార్థ్ లతో కూడిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తుంది. 2019లోనే మహాసముద్రం మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. అయితే 2020లో ఏర్పడిన కరోనా పరిస్థితుల కారణంగా అన్ని చిత్రాల మాదిరి మహా సముద్రం మూవీ షూటింగ్ కూడా డిలే అయ్యింది. 


ఆర్ ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, భారీ హైప్ ఏర్పడింది. వైజాగ్ నేపథ్యంలో సాగే, క్రైమ్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా మహాసముద్రం తెరకెక్కినట్లు సమాచారం. మహా సముద్రం మూవీలో హీరోయిన్స్ గా అను ఇమ్మానియేల్, అదితి రావ్ హైదరి నటిస్తున్నారు. 


ఇక ఈ మూవీలో కీలకమైన విలన్ రోల్ కోసం కెజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ని తీసుకున్నారు. ధనుంజయ్ అనే కౄరుడైన విలన్ గా గరుడ రామ్ కనిపించనున్నారు. ఇటీవల గరుడ రామ్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రావ్ రమేష్ గూని బాబ్జిగా మరో పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మూవీ విడుదలకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ బ్రహ్మం సుంకర మహా సముద్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

in Theatres soon 💞 pic.twitter.com/LQXpFuyO1F

— Sharwanand (@ImSharwanand)
click me!