తమిళ దర్శకుడు లింగు స్వామికి ఊరట లభించింది. మద్రాస్ హైకోర్ట్ నుంచి లింగు స్వామికి గుడ్ న్యూస్ వచ్చింది.
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసు విషయంలో మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఊరట కల్పించింది. లింగు స్వామిపై కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై..హైకోర్ట్ స్టే విధించింది. దాంతో తమిళ దర్శకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?
వివరాల్లోకి వెళ్తే... లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సినిమాను నిర్మించాలని చూశారు. దాని కోసం పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి 2014లో 1.3 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. అయితే ఈసినిమా నిర్మించడం సాధ్యం కాకపోవడంతో.. లింగు స్వామి ఈ మొత్తాన్ని సందరు సంస్థకుతిరిగి చెల్లించారు. అయితే ఈ చెల్లించే క్రమంలో 1.35 కోట్లకు.. లింగు స్వామి చెక్ ఇవ్వగా.. ఆచెక్ బౌన్స్ అయ్యింది.
అయితే లింగుస్వామి ఇచ్చిన ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో చెక్ బౌన్స్ అయినట్టు తెలుస్తోంది. దీంతో పీవీపీ కేపిటల్స్ ఈ విషయంలో లింగు స్వామిపై ..చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాట సంచలనంగా మారింది.
ఇక కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. లింగు స్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి వి.శివజ్ఞానం సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది.లింగుస్వామి తరపున హాజరైన న్యాయవాది ఇప్పటికే 20 శాతం సొమ్మును చెల్లించామని, మరో 20 శాతం సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో 20 శాతం సొమ్మును ఆరు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కింది కోర్టులు ఖరారు చేసిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఆదేశించారు.
తెలుగు, తమిళ భాషల్లో రామ్ హీరోగా ది వారియర్ మూవీని డైరెక్ట్ చేశారు లింగు స్వామి. టాలీవుడ్ తో పాటు.. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆది పినిశెట్టి విలన్గా నటించారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామి తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఆయన ఓ తమిళ స్టార్ హీరో డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.