మాధవన్ తో జాగ్రత్త..అన్నీ తెలిసిపోతున్నాయ్

By Prashanth MFirst Published Dec 12, 2018, 4:07 PM IST
Highlights

రీసెంట్ గా నాగచైతన్య చిత్రం ‘సవ్యసాచి’లో  విలన్ గా నటించి తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్సిన మాధవన్. ఆయన  తాజాగా తెలుగులో మరో చిత్రం కమిటయ్యారని,  రవితేజ నటించనున్న కొత్త సినిమాలో విలన్ గా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాధవన్ వెంటనే స్పందించారు . ఆవార్తలు కేవలం గాలి వార్తలు  మాత్రమేనని వాటిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. 

రీసెంట్ గా నాగచైతన్య చిత్రం ‘సవ్యసాచి’లో  విలన్ గా నటించి తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్సిన మాధవన్. ఆయన  తాజాగా తెలుగులో మరో చిత్రం కమిటయ్యారని,  రవితేజ నటించనున్న కొత్త సినిమాలో విలన్ గా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాధవన్ వెంటనే స్పందించారు . ఆవార్తలు కేవలం గాలి వార్తలు  మాత్రమేనని వాటిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. 

అంటే దీన్ని బట్టి ఆయన రెగ్యులర్ గా తెలుగు సినీ మీడియాను బాగా ఫాలో అవుతున్నారని అర్దమవుతోంది. ఇక్కడ వచ్చే వార్తలు, గాసిప్స్ ని ఆయన చదవటమో లేక ఆయనకు చెప్పే వారు ఉండటమో జరుగుతోందని, కాస్త ఇకనుంచి మాధవన్ గురించి రాసేటప్పుడు పెన్ను మాత్రమే కాక ఒళ్లు కూడా దగ్గరపెట్టుకురాయాలని మీడియా లోకం ఎలర్టైంది.  ప్రస్తుతం మాధవన్ తెలుగులో అనుష్క తో కలిసి ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక రవితేజ నటించనున్న కొత్త చిత్రం తర్వలోనే ప్రారంభం కానుంది. విఐ ఆనంద్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు బాబీ సింహ  విలన్  పాత్రలో నటించే అవకాశాలు వున్నాయి. ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న రవితేజ ఈకొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుందని సమాచారం.

 ఈ చిత్రం  సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అతి  త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. 

click me!