చైతూని మెచ్చుకుంటే నాకు కోపం వస్తుంది.. సాయిపల్లవి..

By Aithagoni RajuFirst Published May 18, 2021, 2:40 PM IST
Highlights

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లవ్‌ స్టోరి`. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన గ్యాప్‌లో సినిమా ప్రమోషన్‌ షురూ చేశారు. 

సెట్‌లో నాగచైతన్యని ప్రశంసిస్తే తనకు కోపం వస్తుందని, దీనికి దర్శకుడు శేఖర్‌ కమ్ముల బలవుతుంటారని చెబుతుంది సాయిపల్లవి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లవ్‌ స్టోరి`. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన గ్యాప్‌లో సినిమా ప్రమోషన్‌ షురూ చేశారు. అందులో భాగంగా రానా హోస్ట్ గా రన్‌ అయ్యే `నెం.1 యారి` షోలో చైతూ, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

 శేఖర్‌ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సెట్‌లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్‌ కమ్ముల ప్రత్యేకత ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్‌ అని చెప్పింది. `నేను సెట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని పొగిడితే..  నేను శేఖర్‌ కమ్ముల వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా` అని సాయిపల్లవి చెప్పింది.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్‌ అని చెబుతుంటానని తెలిపారు. నచ్చకపోతే మానిటర్‌ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్‌ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని `దాదాపు గుడ్‌ అంటారు. ఈ మధ్య `యాక్` అనే పదం కూడా నేర్చుకున్నాడు` అని అనడంలో అంతా నవ్వులు పూసాయి. అంతా ఘోల్లున నవ్వారు. దీనిపై రానా స్పందిస్తూ, ఇది కొత్త పదం అని, తాను మాత్రం `యాక్‌` అనిపించుకునేంత ఎప్పుడూ చేయలేదనడంతో మరింతగా నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటూ వైరల్‌ అవుతుంది. 

click me!