ప్రభాస్... 'మాస్టర్‌' స్ట్రోక్

By Surya PrakashFirst Published Apr 7, 2021, 12:38 PM IST
Highlights

 ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో  ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని  ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
  

'ఖైదీ', 'మాస్టర్​' వంటి సక్సెస్  ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్​.  లోకేష్‌ కనగరాజ్‌  ప్రస్తుతం కమల్‌హాసన్‌తో 'విక్రమ్‌' అనే సినిమా చేస్తున్నారు.  ఆయన నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తోనే తదుపరి సినిమా అన్నా కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు  ఏమీ ముందుకు వెళ్లినట్లు అనిపించలేదు. ఈ నేపధ్యంలో ...ఆయన .. ప్రభాస్​తో సినిమా చేయనున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్టోరీలైన్ రెడీ అయ్యిందని, ప్రభాస్ కి కూడా చెప్పటం జరిగిందని చెప్తున్నారు. 

లోకేష్‌ కనగరాజ్‌ తో చేయబోయే సినిమా సైతం పాన్ ఇండియా స్దాయి అంటున్నారు. పూర్తి స్దాయి స్క్ర్రిప్టుని రెడీ చేయమని ప్రభాస్  పురమాయించాడట. 2022లో మొదలయ్యే ఈ సినిమా ఖైధీలాంటి డిఫరెంట్ ఎప్రోచ్ ఉన్న సబ్జెక్ట్ అని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న ఓ సమస్యను  ఈ సినిమాలో ప్రస్దావిస్తాడని అంటున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో  ఈ సినిమా రూపొందబోతోందిట. నాగ్ అశ్విన్ డైరక్ట్ చేయబోయే సినిమా తర్వాత రిలీజ్ ఉంటుంది కాబట్టి అప్పటి ఎక్సపెక్టేషన్స్ ని మ్యాచ్ అయ్యేలా సినిమా చేస్తాడట. 

ప్రభాస్‌ ప్రస్తుతం 'ఆదిపురుష్‌', 'సలార్‌' చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో  ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని  ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
  
 

click me!