సూపర్ స్టార్ రజనీకాంత్ సేవ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. ఆయన సతీమణి లతా రజనీకాంత్ కూడా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి పలు చారిటి కార్యక్రమాలకు సాయం చేస్తున్నారు. తాజాగా లతా రజనీకాంత్ పోస్ట్ చేసిన ఓ వీడియో సంచనలంగా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో హృదయ విదారకంగా ఉంది. ఓ మహిళ చిన్నారిని కొడుతూ, కాలితో తొక్కుతూ, కింద పడేస్తూ చిత్రవధకు గురిచేస్తున్న వీడియో అది. దీనిపై లతా రజనీకాంత్ స్పందించారు.
లతా రజనీకాంత్ దయా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పౌండేషన్ ఎక్కువగా అనాధ పిల్లలని అక్కున చేర్చుకుంటుంది. పీస్ ఆఫ్ చిల్డ్రన్ పేరుతో లతా రజనీకాంత్ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ వీడియో చూసిన లతా రజనీకాంత్ స్పందిస్తూ.. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు తమకు ఫోన్ చేయాలని ట్విట్టర్ లో ఫోన్ నెంబర్ పొందుపరిచారు. ఇటీవల చిన్నపిల్లలని చిత్ర వద్దకు గురిచేసే సంఘటనలు ఎక్కువవుతూనే ఉన్నాయి.
Peace for Children:let's come together and make a difference.Kindly request everyone to help track this atrocity been committed to a helpless child.Justice must be served and the guilty punished if anyone has any information please share with us at our toll free number18001208866 pic.twitter.com/QFtMsOAbcu
— Latha Rajinikanth (@OfficialLathaRK)