తెరపైకి కృష్ణవంశీ 'రుద్రాక్ష'!

By AN TeluguFirst Published Jun 24, 2019, 3:45 PM IST
Highlights

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశాడు. 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన సక్సెస్ రాలేదు. 'నక్షత్రం' సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు కృష్ణవంశీ. ఇంతకాలం సమయంలో తీసుకొని కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించనున్నారు. గతంలో కృష్ణవంశీ-బండ్ల గణేష్ కాంబినేషన్ లో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తెరకెక్కింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

'నక్షత్రం' కంటే ముందు కృష్ణవంశీ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నాడు. 'రుద్రాక్ష' అనే టైటిల్ కూడా బయటకి వచ్చింది. ఇప్పుడు అదే కథను కాస్త మార్చి తెరపైకి తీసుకొస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా ఓ అగ్ర హీరోయిన్ కనిపించనుంది.

డేట్లు ఫైనల్ అయిన తరువాత హీరోయిన్ తో సహా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాపై కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కథ విని బాగుందని చెప్పడంతో మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 

click me!