దెబ్బతిన్న సింహాలు.. బడ్జెట్ లో జాగ్రత్తలు!

By Prashanth MFirst Published May 3, 2019, 7:19 PM IST
Highlights

దెబ్బ తిన్న వెండితెర సింహాలు ఇప్పట్లో కలిసేలా లేవు. దర్శకుడు బోయపాటి - బాలకృష్ణ ల గత సినిమాలు దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో నెక్స్ట్ అడుగు వేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. కొడితే బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా బద్దలవ్వాలని రోజు చర్చలు జరుపుతున్నప్పటికీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం లేదు. 

దెబ్బ తిన్న వెండితెర సింహాలు ఇప్పట్లో కలిసేలా లేవు. దర్శకుడు బోయపాటి - బాలకృష్ణ ల గత సినిమాలు దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో నెక్స్ట్ అడుగు వేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. కొడితే బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా బద్దలవ్వాలని రోజు చర్చలు జరుపుతున్నప్పటికీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం లేదు. 

వినయ విధేయ రామ సినిమాకు బడ్జెట్ లో లిమిట్స్ లేకుండా ఖర్చు చేసి దెబ్బ తినడంతో ఇప్పుడు బోయపాటి లిమిట్స్ కి బ్రేకులు పడుతున్నాయి. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కూడా నష్టాలను మిగిల్చి మార్కెట్ ని డౌన్ చేసింది. అయితే ఇప్పుడు ఈ కాంబోలో 60కోట్ల వరకు బడ్జెట్ లెక్కలు దాటుతున్నాయని టాక్ వచ్చింది.

ఆ స్థాయిలో బడ్జెట్ అంటే రిస్క్ తో కూడుకున్న పని. 40 లోపు కానిచ్చేయాలని బాలకృష్ణ చెప్పడంతో బోయపాటి కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. టైమ్ బాలేనప్పుడు మార్కెట్ లో ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వెళ్లడం బెటర్ అని ఇద్దరు సమ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన ఒక న్యూస్ వెలువడనుంది.  

click me!