ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్‌ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య

Published : Nov 06, 2020, 08:04 AM IST
ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్‌ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య

సారాంశం

గురువారం జరిగిన ఎపిసోడ్‌లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు. 

లాస్య మరోసారి ఇంటి సభ్యులచేత కన్నీళ్ళు పెట్టించింది. కలచివేసిన సంఘటన చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. అంతేకాదు పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది.  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన ఎపిసోడ్‌లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు. ఎవరు చెప్పిన సంఘటన కదిలిస్తుందో వారిని బెస్ట్ గా ఎంపిక చేసి ఒప్పో ఫోన్‌ గిఫ్ట్ గా ఇస్తారు. 

అందులో భాగంగా లాస్య మాట్లాడుతూ, తాను 2010లోనే మ్యారేజ్‌ చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడిందట. 2012లో కలిసి ఉన్నామని, 2014 జనవరిలో వారి నాన్న నుంచి ఫోన్‌ వచ్చిందట. `మీరు మ్యారేజ్‌ చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. ముందు జీవితంలో సెటిల్‌ అవ్వండి. ఆ తర్వాత తామే స్వయంగా పెళ్ళి చేస్తాం` అని చెప్పారు. అప్పుడు లాస్య చాలా సంతోషించిందట. 

కానీ అదే వారం ఆమెకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళితే గర్బవతి అని చెప్పారట. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందట. దీంతో ఇంట్లో చెప్పకుండానే అబార్షన్‌ చేయించుకుందట. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. 2017లో మళ్ళీ పెద్దల సమక్షంలో మ్యారేజ్‌ చేసుకున్నామని, ఐదు నెలలకే మళ్ళీ గర్బవతిని అయ్యానని, కానీ అది మిస్‌ క్యారీ అయిందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. 2018లో తన పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందని చెప్పింది. కానీ తన ఫస్ట్ బేబీని చంపుకున్నాననే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంద`ని ఎమోషనల్‌ అయ్యింది. అందరిని ఎమోషనల్‌కి గురి చేసింది. 

అందరిలో కెల్లా లాస్య చెప్పిన సంఘటన అందరిని కదిలించింది. దీంతో ఆమె బెస్ట్ గా నిలిచి దివాళి ఎడిషన్‌ ఒప్పో ఫోన్‌ని గెలుచుకుంది. ఇక ఫ్రెండ్‌ కోసం సోహైల్‌ చేసిన సాయం ఘటన కూడా ఆకట్టుకుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్