Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి పరువు తీసేసిన దివ్య.. తులసి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న లాస్య?

By Navya ReddyFirst Published Mar 27, 2023, 9:07 AM IST
Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 27 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో నందు ఇందులో తులసి తప్పేమీ లేదు నా బలవంతం మీదనే నా భార్యగా నటించడానికి ఒప్పుకుంది అని చేతులు జోడించి ఏడుస్తూ మాట్లాడగా అప్పుడు వాసుదేవ్ నువ్వు మోసగాడివి కాదురా స్వార్థపరుడివి. ఒకరి నెత్తిన చేతులు పెట్టి ఎదగాలి అనుకునేవాడు మోసగాడు. తన ఎదుగుదల గురించి ఆలోచించుకునే వాడు స్వార్థపరుడు. నువ్వు నిజం చెప్పినందుకు నాకేం బాధగా లేదు కోపంగా లేదు కానీ భార్య, భర్తలుగా నటిస్తున్నప్పుడు ఎంత మానసిక సంఘర్షణకు లోనయ్యారు నాకు తెలుసు అని అంటాడు. మీరిద్దరు నటిస్తున్నారని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను అని అంటాడు వాసుదేవ్.

నీకంటే ముందే తులసి నాకు అసలు నిజం చెప్పింది తర్వాత నువ్వు చెప్పావు మీ ఇద్దరివి మంచి మనసులు మీ ఇద్దరు మంచివాళ్లే అని పొగుడుతూ ఉండగా లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాసుదేవ్ మాటలకు నందు ఎమోషనల్ అవుతాడు. తర్వాత వెళ్ళొస్తాను అని వాసుదేవ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు తులసి వాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడితో వదిలేద్దాం నేను ఏది మనసుకు తీసుకోలేదు మీరు మనసులో పెట్టుకోకండి. నాకు ఇచ్చిన నెక్లెస్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు హాస్పిటల్ దగ్గర దివ్య ధర్నా చేస్తూ ఉంటుంది.

ఇంతలోనే అక్కడికి రాజ్యలక్ష్మీ సంజయ్ రావడంతో ఏంటి సంజయ్ ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేశావా అనగా లేదు మామ్ అనడంతో మమ్మల్ని దివ్య గారు పిలిపించారు అని అంటారు రిపోర్టర్స్. అయినా నాకు చెప్పకుండా దివ్య ఎందుకు పిలిపించింది దివ్య ఎక్కడ ఉంది అనగా అక్కడ ఉంది అని చెప్పడంతో దివ్య ధర్నా చేస్తుండడం చూసి రాజ్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు దివ్య ను చూసి సంజయ్ రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అప్పుడు రాజ్యలక్ష్మి మీడియా వాళ్ళను పక్కకు వెళ్ళమని చెబుతుంది.

సారీ మేడం మన మధ్యలో మాట్లాడుకోవాల్సిన పర్సనల్ విషయాలు ఏమీ లేవు ఏదైనా ఉంటే మీడియా వాళ్ల ముందే చెప్పాలి అని అంటుంది దివ్య. అప్పుడు దివ్య మాటలకు రాజ్యలక్ష్మి మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు పైకి నవ్వుతూ అది కాదు దివ్య సమస్య ఏదైనా ఉంటే ముందు మనం డిస్కస్ చేసుకోవాలి కదా అని అంటుంది. హాస్పిటల్ పరువు ఏమి కావాలి అనడంతో హాస్పిటల్ లో నీచమైన పనులు జరుగుతున్నాయి కాబట్టే ఇలా రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది అనగా అయినా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు ఏ సమస్య తీసుకొని వచ్చినా నేను పరిష్కరించాను కదా దివ్య అంటుంది రాజ్యలక్ష్మి. అవును దానికి మీకు థాంక్స్ చెప్తున్నాను అనగా ఇప్పుడు కూడా అదే పని చేయాల్సింది.

సమస్య ఏదైనా ఉంటే నాకు సంజయ్ కి చెప్పాలి కదా అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు దివ్య సమస్య సంజయ్ గారితోనే అని అనడంతో సంజయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సమస్య ఏంటి అనగా మేడం అడుగుతున్నారు నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా అని అంటుంది దివ్య. అప్పుడు సంజయ్ చెప్పకుండా టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే దివ్య ప్రియని ముందుకు పిలిచి మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అనడంతో ఆ రాజ్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఎక్కువగా వంగకు దివ్య అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అనడంతో రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

 తనని మోసం చేసి కడుపు చేశాడు అన్యాయం చేయొద్దు అని బ్రతిమలాడుతుంటే కాదు ఛీ పొమ్మన్నాడు అని దివ్య అనడంతో రాజ్యలక్ష్మి సంజయ్ చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి చిరునవ్వు నవ్వుతూ సంజయ్ వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడి ఉంటావో నీ మొఖంలో తెలుస్తోంది మీరందరూ కోరుకున్నట్టుగా తనకి నేను న్యాయం చేస్తాను అని అక్కడి నుంచి వెళ్తుండగా దివ్య ఒక్క నిమిషం మేడం అలా వెళ్ళిపోతున్నారు ఏంటి? ఇంకేం కావాలి దివ్య అనడంతో అందరూ ప్రియ మెడలో సంజయ్ తాళి కట్టాలి అని డిమాండ్ చేయడంతో ఇదే మాటే కదా నేను చెప్పింది అని అంటుంది రాజ్యలక్ష్మి.

అప్పుడు దివ్య అందరి ముందు ప్రియ మెడలో సంజయ్ తాళి కట్టాలి అనడంతో రాజ్యలక్ష్మి సంజయ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దివ్య తాళి చూపించడంతో రాజ్యలక్ష్మి చేసేదేమీ లేక తాళికట్టమని సంజయ్ కి సైగలు చేస్తుంది. అప్పుడు అందరి ముందు సంజయ్ చేసేదేమీ లేక ప్రియ మెడలో తాళి కడతాడు. అప్పుడు దివ్య రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి అందరిని పిలిచి మరోసారి పెళ్లి చేయించండి మేమందరం వస్తాము అని అంటుంది. అప్పుడు సంజయ్ ప్రియని పిలుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందు, తులసి అనసూయ పరంధామయ్య కలసి క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు.

ఆఫీస్ ఫైల్ చూసి తెగ ముద్దులు పెడుతూ సంతోషపడుతూ ఉంటుంది.  ఆ తర్వాత లాస్య నందు వాళ్ళు క్యారం బోర్డు ఆడుతుండగా అక్కడికి వెళుతుంది. అప్పుడు లాస్య పరంధామయ్యతో కలసి తులసి నందులను ఓడించాలి అనుకుంటుంది. నీ మనసులో ఏముందో చెప్పకుండా ఎలా తెలుస్తుంది లాస్య అనగా ఎవరికీ తోచిన సలహాలు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇక నా సలహాలు నా ఆలోచనలతో పనేముంది అంటుంది లాస్య. అప్పుడు గేమ్ అని మధ్యలో మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు దెప్పిపుడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటారు నందు, లాస్య. తర్వాత అందరూ కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు. మరోవైపు రాజ్యలక్ష్మి దివ్య చేసిన పనికి ఇంట్లో వస్తువులను విసిరేస్తూ కోపంతో రగిలిపోతూ ఎలా అయినా దాని అంతు చూస్తాను అనుకుంటూ ఉంటుంది.

click me!