రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ - కేటీఆర్?

By Prashanth MFirst Published Dec 13, 2018, 4:43 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికలకు ముందు సైలెంట్ గా ఉన్న టాలీవుడ్ రిజల్ట్ తరువాత ఒక్కసారిగా కేసీఆర్ - కేటీఆర్ లపై  ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముందు నుంచి కేటీఆర్ కు క్లోజ్ గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేటీఆర్ కు విజయం అనంతరం విషెస్ అందించాడు. 

తెలంగాణ ఎన్నికలకు ముందు సైలెంట్ గా ఉన్న టాలీవుడ్ రిజల్ట్ తరువాత ఒక్కసారిగా కేసీఆర్ - కేటీఆర్ లపై  ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముందు నుంచి కేటీఆర్ కు క్లోజ్ గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేటీఆర్ కు విజయం అనంతరం విషెస్ అందించాడు. 

అయితే అందరిలా విషెస్ తో సరిపెట్టకుండా రామ్ చరణ్ తన సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిదిగా కేటీఆర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఆడియో వేడుకకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 24, 27 తేదీలలో యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఎదో ఒకరోజు గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించాలని అనుకుంటున్నారు. 

అయితే ఇప్పటికే రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు అందరికి తెలిసిపోయింది. ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక వినయ విధేయ రామ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డివివిదానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. 

click me!