లేడీ కిశోర్‌ కుమార్‌.. షణ్ముఖ ప్రియ.. తెలుగు సింగర్‌పై అమిత్‌ కుమార్‌ ప్రశంస

Published : Jan 19, 2021, 09:41 AM IST
లేడీ కిశోర్‌ కుమార్‌.. షణ్ముఖ ప్రియ.. తెలుగు సింగర్‌పై అమిత్‌ కుమార్‌ ప్రశంస

సారాంశం

ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 13కి ఇద్దరు తెలుగుగమ్మాయిలు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల చేరుకున్నారు. అయితే తాజా ఈవెంట్‌లో షణ్ముఖ ప్రియా అద్భుతమైన పాటలతో శ్రోతలను ఫిదా చేయడమే కాదు, కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ని సైతం మెస్మరైజ్‌ చేసింది. ఆయనచే `లేడీ కిశోర్‌ కుమార్‌` అని కితాబు పొందింది. 

ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 13కి ఇద్దరు తెలుగుగమ్మాయిలు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల చేరుకున్నారు. అయితే తాజా ఈవెంట్‌లో షణ్ముఖ ప్రియా అద్భుతమైన పాటలతో శ్రోతలను ఫిదా చేయడమే కాదు, కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ని సైతం మెస్మరైజ్‌ చేసింది. ఆయనచే `లేడీ కిశోర్‌ కుమార్‌` అని కితాబు పొందింది. `ఆర్‌.డి.బర్మన్‌ – కిశోర్‌ కుమార్‌` ఎపిసోడ్‌లో `దమ్‌ మారో దమ్` పాట పాడింది షణ్ముఖ ప్రియ. దాంతోపాటు కిశోర్‌ కుమార్‌ తన పాటల్లో చేసే యోడలింగ్‌ కూడా చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ షణ్ముఖప్రియ టాలెంట్‌ను చూసి అవాక్కయ్యాడు. ఆమెకు తన తండ్రి ఇష్టంగా తినే రబ్డీని స్వహస్తాలతో తినిపించాడు. 

ఇండియన్‌ ఐడల్‌ అంటే భారతీయ సింగర్‌లకు అతిపెద్ద ఫ్లాట్‌ఫామ్‌. ఈ రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే కష్టం. అలాంటిది టాప్‌ 13లో నిలిచారంటే అది గొప్ప విషయం. వైజాగ్‌కి చెందిన తెలుగమ్మాయిలు షణ్ముఖ ప్రియా, శిరీష చేసి చూపించారు. ప్రస్తుతం వీరిద్దరు టాప్‌ 13కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ ప్రియ తన అద్భుతమైన గానంతో అలరించింది. ఆ ఎపిసోడ్‌ను కిశోర్‌ కుమార్‌ - ఆర్‌.డి.బర్మన్‌ పాటలతో డిజైన్‌ చేశారు. 

ఈ ఎపిసోడ్‌కి స్పెషల్‌ గెస్ట్ గా కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ హాజరయ్యారు. ఆయన ముందు షణ్ముఖ ప్రియా.. ఆర్‌.డి.బర్మన్‌ కంపోజ్‌ చేసిన `దమ్‌ మారో దమ్‌` పాట పాడింది. కిశోర్‌ కుమార్‌ చేసే యోడలింగ్‌ చేసింది. `యోడలే.. యోడలే.. యోడలే.. ` అని పాడేదే యోడలింగ్‌. ఇందులో షణ్ముఖ దాదాపు ఐదు నిమిషాల పాటు యోడలింగ్‌ చేయడం విశేషం. దీంతో ఇది చూసి అమిత్‌ కుమార్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు `మా నాన్నకి రబ్డి తినడం చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు నాలుగు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా రబ్దీ తిన్నారు. ముంబయి నుంచి ఓ షాప్‌ నుంచి ఈ రబ్దీని కొనేవారు. ఈ రోజు అదే షాప్‌నుంచి నేను తీసుకొచ్చిన రబ్దీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం తప్పక ఉంటుంది` అని ప్రశంసిస్తూ రబ్దీని తినిపించారు. 

ఈ సందర్భంగా ఆయన కిశోర్‌ కుమార్‌ గురించి పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. `నాన్న తన గొంతు కోసం అప్పుడప్పుడు ఎండిన తమలపాకులు తినేవారు. గొంతు డ్రైగా ఉంటే బాగా పాడొచ్చు అనుకునేవారు. పాట పాడాక చవన్‌ ప్రాశ్‌(డబ్బులు) పుచ్చుకుని ఎంత తొందరగా రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి బయటపడదామా` అని చెప్పారు. ప్రస్తుతం ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 12లోని టాప్‌ 13 కంటెస్టెంట్స్‌లో ఆరు మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం గొప్ప విషయం. మిగిలిన నలుగురు అంజలి గైక్వాడ్‌ (మహరాష్ట్ర), అరుణిత (పశ్చిమ బెంగాల్‌), శైలి కాంబ్లె (మహారాష్ట్ర), అనుష్క బెనర్జీ (చండీగఢ్‌). 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌